6, అక్టోబర్ 2017, శుక్రవారం

సమాజంలోని రాబందుల వికృతం

ఒకప్పుడు ఎవరైన కష్టంలో వుంటే, చుట్టువున్న నలుగురు సాయం అందించడానికి నడుం బిగించేవారు. రాను రాను ఎవరైనా ఆపదలో వుంటే " అయ్యో పాపం" అని జాలి చూపడమే గగనం అయిపోయింది.  ప్రస్తుతం సమాజంలో పరిస్తితులు ఎంతగా దిగజారిపోయాయో ఇటీవలి ముంబై ఎల్విన్ స్టొన్ రైల్వే బ్రిడ్జ్ ప్రమాద దుర్ఘటన కళ్ళకు కట్టింది. తొక్కిసలాటలో మరణించిన వారు, గాయపడిన బాదితులతో ఆ ప్రదేశం విషాద వాతావరణం  అలముకొని భీతావహంగా వుంది. శవాలను పీక్కుతినే రాబందులు కూడా సిగ్గుపడేల- కొన్ని మానవ మృగాలు గాయపడిన మహిళలపై లైంగిక దాడులు, నగదు,నగలు,వస్తువుల అపహరణకు పాల్పడ్డాయి. ఎంత ఘోరం, ఎంత పాపం,ఎంత నికృష్టం అని మానవ సమాజాన్ని చూసి జాలిపడుతున్నాయి అసలు రాబందులు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...