13, అక్టోబర్ 2017, శుక్రవారం

అంతర్జాతీయ ఆన్ లైన్ సంస్థ అమెజాన్ కే అంటకత్తెర వేసిన గడుగ్గాయిలు

సాధారణంగా ఆన్ లైన్ ద్వారా కొన్న వస్తువులు నాణ్యంగా లేవనో, డూప్లికేట్ వస్తువులు పంపారనో, అసలు వస్తువులే లేని ఖాళీ బాక్స్ లు పంపించారనో సదరు ఆన్ లైన్ సంస్థలపై ఫిర్యాదులు రావడం సహజం. అందుకు భిన్నంగా అమెజాన్ ఇండియా సంస్థ ఈ సంవత్సరం ఏప్రియల్ - మే నెలలలో 166 ఖరీదైన సెల్ ఫోన్స్ డెలివరీ తీసుకుని, ఆ ఫోన్స్ తమకు చేరలేదని డబ్బులు రిటన్ వేయించుకొని కొందరు మోసం చేసారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మోసానికి కారకులైన శివం చోప్రా, సచిన్ జైన్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి వారి ఆట కట్టించారు. శివం చోప్రా వేరే వేరే ఫోన్ నంబర్ల ద్వారా తప్పుడు అడ్రస్, ఖాతా దారుల పేర ముందుగా డబ్బులు చెల్లించి,  ఖరీదైన సెల్ ఫోన్స్ బుక్ చేసేవాడు.  డెలివరీ బాయ్స్ ఆ అడ్రెస్ లకు వచ్చి, తెలుసుకోలేక  ఫోన్ చేయగా,  తాను వేరే చోట వున్నానని అక్కడకు వారిని రప్పించుకొని డెలివరీ తీసుకొనేవాడు. తరువాత తనకు ఖళీ బాక్స్ మాత్రమే పంపారని అమెజాన్ కు ఫిర్యాదు చేసి డబ్బులు రిఫండ్ వేయించుకొనే వాడు. ఇందుకు అవసరమైన సిం నంబర్లను సచిన్ జైన్ సమకూర్చి పెట్టేవాడు. ఈ క్రమంలో వీరు 141 ఫోన్ నంబర్లను, 48 మంది తప్పుడు ఖాతదారుల వివరాలను వినియోగించారు.  వీరి వద్ద నుండి 12 లక్షలు,25 సెల్ పోన్స్, 40 వివిద బాంక్ ఖాతా పాస్ బుక్ లను పోలీసులు వశపర్చుకున్నారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...