24, జులై 2017, సోమవారం

కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహిళా క్రికెట్ టీం

ఈ జట్టు అబలల జట్టు కాదు. భారత పతాకను విశ్వ క్రీడా వేదికపై సగర్వంగా రెప రెపలాడించిన సబలల జట్టు.  వీరు మహిళల వరల్డ్ కప్ తృటిలో కోల్పోయి వుండవచ్చు, కానీ కోట్లాది భారతీయుల, ప్రపంచవ్యాప్త క్రీడాభిమానుల అమూల్య అభిమానాన్ని సాధించుకొచ్చారు. సుమారు నెల రోజుల క్రితం అదే గడ్డపై జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మన పురుషుల జట్టు వోటమి.  ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ ఫైనల్ లో మహిళా జట్టు వోటమి.  రెండు వోటములకు మధ్య ఎంతో తేడా . చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్థాన్ చేతిలో ఎటువంటి పోరాటం చేయకనే, చిత్తుగా వోడి అశేష భారత అభిమానుల ఆగ్రహాన్ని,  చీత్కారాలను మూటగట్టుకుంది పురుషుల జట్టు.అంచనాలు లేని జట్టుగా వుమెన్స్ వరల్డ్ కప్ బరిలోకి దిగి, అంచెలంచెలుగా అద్బుథ విజయాలను సాధించి, ఫైనల్లో పోరాడి వోడి క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది మన మహిళల జట్టు.  భారత క్రికెట్ కు సుదీర్ఘ సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ కు కప్ ను బహుమతిగా  అందించాలన్న లక్ష్యంతో దోని సారద్యంలోని భారత పురుషుల జట్టు అద్బుత  ప్రదర్శన చేసి 2011
వరల్డ్ కప్ ను సాధించింది. ఇప్పుడు అదే విధంగా మహిళల క్రికెట్ కు సుదీర్ఘంగా సేవలు అందిస్తున్న జులన్ గోస్వామి, మిథాలి రాజ్ లకు ప్రపంచ కప్ అందించాలన్న దృడ లక్ష్యంతో యువ మహిళల జట్టు కదం తొక్కింది. లక్ష్యసాధన ముంగిట తడబడినా, భారత మహిళా క్రికెట్ పతాకను సరికొత్త కీర్తి శిఖరానికి చేర్చారు. 1983 వరల్డ్ కప్ సాధించి కపిల్ డెవిల్స్ టీం  భారత క్రికెట్ లో కొత్తశకాన్ని ఎలా ఆరంభించిందో ...ఇప్పుడు మిథాలీ సేన అలాగే భారత మహిళ క్రికెట్ లో నూతన అధ్యయాన్ని లిఖించింది. మహిళల క్రికెట్ఇక  ఎంత మాత్రం చులకన కాదు.ఇక ప్రతి అడుగు సంచలనమే. హేట్సాఫ్ ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీం . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...