వుత్తరాంద్ర (విశాఖ,విజయనగరం,శ్రీకాకుళం) ప్రాంతంలో శతాబ్దాల క్రితం పురుడుపోసుకున్న జానపద నృత్య కళ "తప్పెట గుళ్ళు". 15-20 మంది గల కళాకారుల బృందం కాళ్ళకు కట్టిన గజ్జెలు, మెడలొ వేల్లాడుతున్న డప్పు వాద్యలను లయబద్దంగా మ్రోగిస్తూ, వలయాకారంలో తిరుగుతూ, పాడుతు నృత్యాలు చేస్తారు. యాదవ(గొల్ల) సామాజిక వర్గం వారు ఈ జానపద కళకు కారకులుగా చరిత్రకారులు చెపుతున్నారు. ఈ ప్రదర్శనలో రామాయణ,భారత, భాగవత ఘట్టాలు ప్రధానంగా ప్రస్తావన చేస్తుంటారు. గతమెంతో ఘనచరిత్ర వున్న ఈ జానపద నృత్యం - ఆధునిక సాంకేతిక కారణంగా కొడిగడుతున్న కళలలో వొకటిగా చేరి, నేడు కనుమరుగు అయిపోయే పరిస్థితిలో వుంది. మూడు, నాలుగు బృందాలుగా మాత్రమే మిగిలి వున్న ఈ ప్రాచీన జానపదకళను పరిరక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఎంతో వుంది. కొన్ని దశాబ్దలుగా నిర్లక్ష్యానికి గురి అవుతూ వస్తున్న ఈ "తప్పెట గుళ్ళను" నూతన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వం అయినా ఆదరించి, అక్కున చేర్చుకొని- భవిష్యత్ తరాలకు అందించే బృహత్ కార్యాన్ని తలపెడుతుందని ఆకాంక్షిద్దాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?
జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం. జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...
-
సినిమా పాటల రచయితగా చాలా ప్రసిద్దులు భువనచంద్ర. యువతను హుషారెక్కించే పాటలే కాదు, సెగ రేకెత్తించే శృంగార గీతాలుతో ఉర్రూతలూగించారు. ఆయన ఆహా...
-
"నాన్నా..నాన్నా...నాన్నా.." రాత్రి పది గంటల సమయంలో నిర్మానుష్యంగా వున్న ఆ వీధిలో నాలుగేళ్ళు నిండిన చింటూ ఏడుపు...
-
చిన్న, చిన్న సమస్యలు మొదలుకొని పెద్ద, పెద్ద సమస్యల వరకు సాంకేతికత అభివృద్ధి పుణ్యమా అని కూర్చున్న చోటునుండి కదలకుండానే పరిష్కారం అయిపోతున...
జానపద కళలపై కధనం బాగుంది.
రిప్లయితొలగించండి