29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

తెలుగు రాష్ట్రాలలో తమిళ పర్యాటక ప్రచార దందా..!

               
ది 29-09-2017 వ తేదీ సికింద్రాబాద్ నుండి ఏలూరు వెళ్ళుటకు రైల్వే బుకింగ్ లో ఇచ్చిన ప్రయాణ టికెట్ ఇది. ప్రయాణం రెండు తెలుగు రాష్ట్రాలలో.  ఇచ్చిన రైల్వే టికెట్ పై ముద్రించిన ప్రచార చిత్రాలు తమిళనాడు పర్యాటకానికి సంబంధించినవి.  విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో రెండు తెలుగు రాష్ట్రాలకంటే ముందు మాత్రమే కాదు, దేశంలోనే ముందంజలో ఉంది తమిళనాడు రాష్ట్రం.  రైల్వే కేంద్ర ప్రభుత్వం పరిది కదా..?  వారి ఇష్టం అంటారా..! పర్యాటకులను ఆకర్షించడంలో రైల్వేలది కీలక పాత్ర.  ఇటువంటి అత్యుత్తమ ప్రచార సాధనన్ని ఉదారంగా తమిళనాడుకు కేటాయించడం సముచితం కాదు.  ఇది చిన్న విషయమే కావచ్చు.  కాని పర్యాటకంలో అగ్రస్థానంలో ఉన్న తమిళనాడు ఈ అవకాశాన్ని వదులుకోలేదుగా..?  మరి తెలుగు రాష్ట్రాలు ఎందుకు వదులుకోవాలి..? ఈ విషయం తెలంగాణా, ఆంధ్ర ప్రభుత్వాల దృష్టిలో లేదా..? సంబందించిన విషయం కాదా..?  అన్ని విషయాలలో పోటీ పడే ఇరు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు ఈ తమిళనాడు ప్రచార దందాకు ముగింపు పలికి,  తెలుగు రాష్ట్రాల పర్యాటకానికి కేటాయించేలా చర్యలు చేపట్టాలి.       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...