17, అక్టోబర్ 2017, మంగళవారం

ఎట్టకేలకు తెలుగు దేశం "బుట్ట"లోకి రేణుక

సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపధ్యంలో అధికార "సైకిల్" స్పీడ్ పెంచింది.  తెలంగాణా లోని అధికార టి ఆర్ ఎస్ పార్టీ తన ప్రణాళికలో భాగంగా 13 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఖాతాలో జమ చేసుకొని టి డి పి కి  కోలుకోలేని షాక్ ఇచ్చింది.  ఈ అనుభవాన్నే పాఠంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో 21 మంది వై సి పి ఎమ్మెల్యేల కు   పార్టీ కండువాలు కప్పేసింది   అధికార తెలుగు దేశం.  అందులో 4రిని మంత్రులు కూడా చేసి పారేసింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇద్దరు వైసిపి ఎంపీలు టిడిపి పంచన చేరారు.  అప్పటి నుండి ఏదో చోటా,మోటా నేతలు, కార్యకర్తలు తప్ప పెద్ద తలకాయలు తప్పిపోకుండా ఇప్పటి వరకు బాగానే కాచుకున్నారు జగన్.  తాజగా కర్నూలు ఎంపి బుట్టా రేణుక టిడిపి లోకి సర్దుకోవడం వైసిపి కి కలవరం కలిగించే అంశమే. కాకపోతే రేణుక చాలా కాలంగా తెలుగుదేశం లోకి వెళ్ళిపోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. రేణుక భర్త నీలకంఠం టిడిపి లోనే వున్నా అంత క్రియాశీలకంగా లేరు. ఎన్నికలకు తరుణం సమీపించే కొద్ది అధికార పక్షం దూకుడు పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. మరో ప్రక్క జనసేన కూడా తలుపులు బార్లా తెరచే వుంచింది. వీటిని తట్టుకొని వైసిపి శ్రేణులను జగన్  ఎన్నికలకు ఎలా సిద్దం చేస్తారన్న  విషయమై  విశ్లేషకులు  ఆసక్తిగా వున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...