25, అక్టోబర్ 2017, బుధవారం

నేటి ఈనాడులో ప్రజారోగ్యంపై అమూల్యమైన ఆర్టికల్

వ్యాసకర్త పి.ఎస్. ఎం. రావు. సమాజంలో వాస్తవ పరిస్తుతులకు అద్దం పట్టిన వ్యాసమిది. విషయ పరిజ్ఞానంతోనే సరిపుచ్చక, క్షేత్ర స్థాయిలో స్వతహ్ సిద్ద పరిశీలనానుభవంతో రాసిన ఇటువంటి ఆర్టికల్స్ అరుదుగా తారసిల్లుతాయి. ప్రాధమిక వైద్యం కూడా సామాన్యునికి గగనమౌతున్న నేటి రోజుల్లో, తీవ్ర, ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తే ఎలా ఎదుర్కోవాలో అన్న బెంగతోనే వున్న ప్రాణాలు కూడా ముందే హరీ అంటున్నాయి. ఎంతో ప్రాముఖ్యమైన ప్రజారోగ్యంపై పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా, చూపే నిర్లక్ష్యం మాత్రం మారడం లేదు.వైద్య విద్య అంతకంతకూ ఖరెదుగా మారడంతో, వైద్య రంగంలో మానవతా విలువలకు గ్రహణం పడుతుంది. ప్రజారోగ్య పరిరక్షణలోని ప్రస్తుత లొసుగులను నిర్ధాక్షిణ్యంగా ఎండగట్టింది ఈ వ్యాసం. ప్రభుత్వాలు కళ్ళు తెరచి, వైద్య విధానంలోని కుళ్ళును ప్రక్షాళించాసిన తక్షణ తరుణమిది. ప్రజలు ప్రభుత్వాలను గొంతెమ్మకోరికలు కోరడం లేదు. కనీస ఆరోగ్య భధ్రతను అర్ధిస్తున్నారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ లాంటి వారు గళం వినిపిస్తున్నా, ఆలకించేవారేరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...