8, మార్చి 2018, గురువారం

కాంగ్రెస్ తప్పిదాల బాటలోనే బి.జె.పి అడుగులు..?

     దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ కు కూడా సాధ్యంకాని రీతిలో బిజెపి నేడు అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోవడం ద్వారా చరిత్ర సృష్టిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ప్రణాళికలు రచించి ఈశాన్య రాష్ట్రాలలో కూడా పాగా వేసి భారత రాజకీయాలలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.  ఎటొచ్చి దక్షిణాదిలోనే బిజెపికి గండిపడుతుంది.  కర్నాటక తప్పించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో సొంతంగా అధికారంలోకి కాదుకదా వునికి కాపాడుకోవడానికే శ్రమించాల్సిన గడ్డు పరిస్థితి.  నాటి సమైఖ్యాంధ్రప్రదేశ్ లోను, నేటి నూతన నూతన ఆంధ్రప్రదేశ్ లోను తెలుగుదేశం తో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా అధికారంలో భాగస్వామ్యం పొందింది.  ప్రత్యేక హోదా తో పాటుగా ఇతర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమయ్యిందన్న కారణం సాకుగా చూపి టిడిపి తనంత తానుగా తెగతెంపులు చేసుకోవడంతో,  దక్షిణాదిలో బిజెపికి వున్న ఒక్క అధికార ఆధారం  కూడా నేడు దూరం అయిపోయింది.  నాడు కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రోద్భలంతో తన ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన సోనియా తదుపరి తెలంగాణలో అధికారానికి ఆమడ దూరంలో నిలబడిపోవడమేకాక, ఇటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. నాడు కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రోద్భలంతో తన ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన సోనియా తదుపరి తెలంగాణలో అధికారానికి ఆమడ దూరంలో నిలబడిపోవడమేకాక,  ఇటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడుచుపెట్టుకుపోవడంతో తలపట్టుకొని కూర్చున్నారు. నేడు భారత రాజకీయాలలో బాహుబలిలా కీర్తించబడుతున్న  మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయమై కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే రిపీట్ చేస్తున్నట్లు అనిపిస్తున్నది ప్రస్తుత రాజకీయ వాతావరణం.  కాంగ్రెస్ పతనం ఖాయమని నిర్ధారణ చేసుకొని, అప్పటి వరకు పార్టీలో కీలక భాద్యతలు నెరవేర్చిన పెద్ద తలకాయలు కొన్ని బిజెపిలోకి చప్పున దూకి తమ రాజకీయ పలుకుబడికి ఢోకా లేకుండా చూసుకున్నారు.  ప్రజలలో వారిపట్ల వున్న వ్యతిరేకత కొంతవరకు తగ్గిన తరువాత,  నాడు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రభావితం చేసినట్లే బిజెపి అధిష్టానాన్ని ప్రభావితం చేయడం మొదలెట్టారని విశ్లేషకులు అంటున్నారు. స్వతహాగ మొదటి నుండి తెలుగుదేశంతో బద్దశతృత్వం కలిగి వున్న వీరు నెమ్మదిగా మోడీ-బాబుల మద్య నిప్పు రాజేసి, నేటి మంటలలో చలికాచుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.  కేంద్రం పెద్ద ఎత్తున సహాయం చేస్తే అది టిడిపి ఇమేజ్ పెరగడానికి దొహదపడుతుంది తప్ప బిజెపికి ఏ మాత్రం ప్రయోజనం వుండదని,  రాష్ట్రంలొ ఏ పార్టీ అధికారంలో వున్నా బిజెపి ప్రసన్నం కోసం ప్రాకులాడాల్సిందే అన్న పెద్దల మాట విని  మోడీ నెమ్మదిగా సహాయ నిరాకరణ చేసినట్లు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ముందునుంచి బిజెపి సానుకూలత ప్రదర్శితుండడంతో బిజెపికి మరింత దన్ను వచినట్లైంది. నాడు లక్ష్మీ పార్వతి వ్యవహారం ముదిరినంత వరకు వేచివుండి, ప్రజలలోను, పార్టీ వర్గంలోను అధికారం ఎన్ టి ఆర్ వద్దనుండి చంద్ర బాబు చేపడితేనే బావుంటుంది అన్న అభిప్రాయం వచ్చేలా చేసి తన రాజకీయ చతురతను ప్రదర్శించిన బాబు నేడు మళ్ళీ తన చాణక్యాన్ని ప్రదర్శించారు.  ప్రత్యేక హోదా ఇతర అంశాలు సఫలత సాధించలేకపోవడంలో టిడిపి-బిజెపిలకు సమాన భాద్యత వున్నప్పటికి నేడు ఆ పాపం మొత్తం బిజెపి కే అంటగట్టడంలో కృతకృత్యుడయ్యారని చెప్పక తప్పదు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్తితికిలాగ   బిజెపిని తీసుకు వచ్చి  ఏకాకిని చేస్తునారు.  ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తుండడం,  పాదయాత్ర విజయవంతంగా సాగుతూ మైలేజ్ పెంచుకుంటున్న జగన్ కోరి కోరి ఇప్పుడు బిజెపి పొత్తు కొరివి కొని తెచ్చుకొనే సాహసం చేయడు.  ఇప్పటికైనా బిజెపి అధిష్ఠానం కళ్ళు తెరచి ఎపికి సాయమందించకుంటే 2014 లో కాంగ్రెస్ కు జరిగిన పరాభవమే పునరావృతం అయ్యే అవకాశాలు కమలానికి పుష్కలంగా కనిపిస్తున్నాయి.  గతంలో ఎన్నడూ లేనంత బలీయంగా వున్న బిజెపి కి  తెలుగు రాష్ట్రాలలో ఎదురుగాలి పెద్ద విషయం కాకపోవచ్చు కాని, ఆ మహా సామ్రాజ్యపు కోటలకి బీటలు పడే బీజం ఇక్కడే కావొచ్చు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...