19, ఆగస్టు 2017, శనివారం

బోరు బావిలో నిలిచిన ప్రాణం

నిర్లక్ష్యంగా వదిలివేస్తున్న బోరు బావులలోపడి బాలలు మరణిస్తున్నా- తగిన రక్షణ చర్యలు  కొరవడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్ట్ 15వ తేది సాయంత్రం 3.30 ని. సమయంలో గుంటూరు జిల్లా వినుకొండ మండలం వుమ్మడివరం గ్రామ పొలాలలోని బోరు బావిలో చంద్రశేఖర్ అనే రెండు సంవత్సరాల బాలుడు పడిపోయాడన్న వార్త తెలియగానే - ఎక్కడ మరో విషాద వార్త వినాల్సి వస్తుందోనని అందరూ కలవర పడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరొగ్య శాఖలు హుటా హుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించాయి.  ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలు కూడా చేరుకుని రంగంలోకి దిగాయి. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రొక్లెన్లను వుపయోగించి బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వడం ప్రారంభించారు. మరో ప్రక్క బాలుడుకి పైప్ ద్వార ఆక్సిజన్ అందించారు. ఒక ప్రక్క భారీ వర్షం కురవడం మరింత ఆందోళనకు దారి తీసింది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఫొన్ ద్వార పరిస్థితిని సమీక్షించారు. తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో బాలుడిని సజీవంగా బయటకు తీయడంతో ఒక్కసారిగా ఆ ప్రదేశంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.    ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వ శాఖలన్నీ, సమన్వయంతో స్పందించి అందించిన సహాయక చర్యలు అమోఘం. ఇకనైనా మరలా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దాదాపు ఈ సంఘటనలు గ్రామాలలోనే జరుగుతున్నందున అన్ని గ్రామపంచాయితీలు - నిరుపయోగంగా వున్న బోరుబావులు మూసివేతకు  తీర్మానాలు చేపట్టేల ఆదేశాలు జారీ చేయాలి. తక్షణమే తనిఖీ బృందాలను క్షేత్ర స్థాయిలో పరిశీలనకు పంపి నిబందనలు పాటించని వారికి భారి జరిమానాలు,శిక్షలు విధించేలా చూడాలి. పసి ప్రాణాలను కబళిస్తున్న బోరుబావుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...