24, ఆగస్టు 2017, గురువారం

నంద్యాలలో టిడిపి దే గెలుపు : లగడపాటి

80% పోలింగ్ నమోదైన నంద్యాల లో టిడిపియే సీటు గెలుచుకోనుందని మాజీ ఎంపి లగడపాటి స్పష్టం చేస్తున్నారు. లగడపాటి స్వయంగా చేయించే సర్వేల పై ప్రజలలో మంచి విస్వసనీయత వుంది. దివంగత రాజశేఖర్ రెడ్డి కూడా రాజగోపాల్ అద్యయనాలకు విలువ ఇచ్చేవారని ఆయన అనుయాయులు అంటుంటారు. గత కొద్ది కాలంగా టిడిపితో రాసుకు పూసుకు తిరుగుతున్నందున, ఇది రాజగోపాల్ చేస్తున్న గిమ్మిక్ గా వైసీపి శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం లేక పోలేదు. సమైఖ్య రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేసిన లగడపాటి - తదనంతర పరిణామాలతో ఇన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా వుంటూ మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ సమైఖ్యాంద్రకు గట్టి మద్దతుదారుగా నిలచిన లగడపాటి పై తెలంగాణా కాంగ్రెస్ నేతలతో పాటు, ఢిల్లి అధిష్టానం కూడా కన్నెర్ర చేసింది. నాడు లగడపాటితో పాటు అధికారాన్ని అనుభవించిన సహచర నేతలు చాలామంది రాష్ట్ర విభజనానంతరం  టిడిపి,  వైసిపి,  బిజెపిలలో ఆశ్రయం సంపాదించి సెటిల్ అయిపోయారు. రాజగోపాల్ మాత్రం నాటి నుండి నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగానే వున్నారు. గత కొద్ది కాలంగా టిడిపి నేతలతో లగడపాటి చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నారు. నిజానికి లగడపాటి వంటి నాయకుడ్ని ఏ పార్టీ అయినా ఆదరంగా అక్కున చేర్చుకుంటుంది. రాజకీయాలలో శాస్వత శతృత్వం, శాస్వత మితృత్వం వుండనట్టే  శాస్వత ప్రమాణాలు, శాస్వత వాగ్దానాలు కూడా  వుండవేమో   కదా!    

2 కామెంట్‌లు:

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...