10, సెప్టెంబర్ 2017, ఆదివారం

పాపికొండల్లో పడవ ప్రయాణం

కుటుంబ సమేతంగా జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. తక్కువ వ్యయంలో, తక్కువ సమయంలో (ఒక రోజు) చూసి రాగలిగే మద్యతరగతి బడ్జెట్ ట్రిప్.  పచ్చని ప్రకృతి ఒడిలో,  గల గలా పారే గోదారిపై లాంచీ ప్రయాణంతో జీవన పోరాటంలోని ఒత్తిళ్ళన్ని కాసేపు మర్చిపోయి అద్భుతమైన ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు.  తిరిగి మన జీవన గమనానికి సరి కొత్త వుత్సాహాన్ని రీచార్జ్ చేసుకోవచ్చు.  రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రభుత్వ, ప్రైవేట్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఈ పాపికొండలు లాంచి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుంటారు.  మన తెలుగు సినిమాలు ఎన్నింట్లోనో ఈ పాపికొండలు కనువిందు చేసాయి,చేస్తున్నాయి.  ముఖ్యంగా సేనియర్ దర్శకుడు వంశీ చిత్రాలలో మరింత మనోహరంగా వుటాయి ఈ గోదారి అందాలు.  దర్శకుడు శేఖర్ కమ్ముల "గోదావరి" తో పాపికొండలు లాంచి ప్రయాణానికి మంచి ప్రాచుర్యత లభించింది.  త్వరలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కానున్నందున, అప్పుడు పాపికొండలు పర్యటనలలో ఏ మార్పులు చోటు చేసుకుంటాయొ తెలియనందున - వీలైనంత త్వరలో ఒక చూపు చూసేద్దామా..!         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...